9, నవంబర్ 2018, శుక్రవారం

ప్రజాస్వామ్యం మన పాదుకలు కావాలి

అయ్యలార... అమ్మలార
మా అయ్య చంద్రబాబు
కరుణానిధి కొడుకు స్టాలిన్ ని కలిశాడు
దేవెగౌడని తన కొడుకు కుమారా స్వామి నీ కలిశాడు
సోనియా సుపుత్రుడు రాహులు నీ కలిశాడు
ములాయం కొడుకు అఖిలేష్తో మాట్లాడాడు
కలిసి బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ఎలా ఖూనీ చేస్తుందో
సవివరంగా మనవి చేసాడు
ఎలా ? ఇలా అయితే ఎలా ?
మన వంశాలు , వంశాంకురాలు లేకపొతే ఎలా
ఈ దేశం ఎలా బాగుపడుతుంది ?
దేశానికి దిక్కెవరు ? మన వంశాలకి వశమయ్యేదెవరు?
ఈ దేశపు ప్రజాస్వామ్యం నడిచేదెలా ? ఎలా ?
మోడీకేమి తెలుసు పుత్ర వాత్సల్యం ?
వానికేమి తెలుసు కడుపు తీపి కక్కుర్తి ?
మన కడుపు తీపి తరువాతే
దేశమయినా, దేవుడయినా
ఈ నేల, ఈ భూమి, ఈ పుడమి , ఈ థర్తి,
తరతరాలుగా, అనాదిగా, అనాధగా
మొఘలుల శృంఖలాలలో
తెల్లవారి తుపాకులతో
బానిస బ్రతుకలలో మ్రగ్గినది
కొత్తగా , సరికొత్తగా
ఇపుడెందుకు ప్రజలు మారాలి
అదే వూడిగం చేస్తూ , అవే పల్లకీలు మోస్తూ
తరించాలి వారు, తందానా అంటే
తందానా  అని తలలూపాలి వారు
ప్రజాస్వామ్యం పరడవిల్లాలి
ప్రజాస్వామ్యం మన పాదుకలు కావాలి

1 కామెంట్‌: