గుజరాత్ రాష్ట్రం లో కొద్ది రోజుల క్రితం ఆసియా లోకెల్లా
అతి పెద్ద సోలార్ పవర్ స్టేషన్ ను నెలకొల్పి ప్రారంభం చేశారు , ఆ రాష్ట్ర
ముఖ్యమంత్రి నరేంద్ర మోడి. ఈ సందర్భము గా
నరేంద్ర మోడి ‘రూఫ్ టాప్ పోలసీ’ ని ప్రకటించారు. ఈ పధకం ద్వారా, గుజరాత్ రాష్ట్రం
లో ఇళ్ళ పైన, ఆఫీస్ రూఫ్ మీద ప్రజలు సోలార్ పేనల్స్ ఏర్పాటు చేసుకొని విద్యుత్
వుత్పాదన చేసుకొని తమ అవసరాలకూ వాడుకోవచ్చు
లేదా గ్రిడ్ కి విద్యుత్ పంపించి ఆదాయం సంపాదించవచ్చు . గుజరాత్ రాష్ట్రం
ఇలా అనేక విషయాల్లో దేశం లోనే అత్యంత అభివృద్ధి చెందుతున్నది .
ఈ వార్త విన్న తరువాత సోనియా గాంధీ కి తెగ ఈర్ష్య కలిగి
కిరణ్ కుమార్ రెడ్డికి ఫోన్ చేసి, “కిరణ్ కుమార్ రెడ్డీ, మన కాంగ్రెస్ ప్రభుత్వ
మున్న ఆంద్ర ప్రదేశ్ లో కూడా రూఫ్ టాప్ పోలసీ అర్జెంట్ గా పెట్టేసి బిజెపి పాలిత
రాష్ట్రమయిన గుజరాత్ కి గట్టి పోటీ ఇవ్వాలి. నువ్వూ బొత్స సత్తిబాబు ఇక తన్నుకోవటం
ఆపి ఆ దిశ గా ఆలోచించండి” అని ఆర్డరు వేసింది.
కిరణ్ కుమార్ రెడ్డి దానికి సమాధానంగా ఇలా అన్నాడు ,
“తప్పకుండా మేడం, మీరు శెలవు ఇచ్చినట్లు గానే చేస్తాము. దీన్ని ఒక పధకం గా
ప్రకటిస్తాము. ఒక చిన్న మనవి, ఆంద్ర ప్రదేశ్ లో వున్న పధకాలన్నిటికీ ఇప్పటికే మీ
అత్త గారు ఇందిరా గాంధీ పేరూ, మీ భర్త రాజీవ్ గాంధీ పేరూ పెట్టే శాము. ఇక
పెట్టబోయే పధకాలకి రాహుల్ గాంధీ పేరు లేక పొతే ప్రియాంకా (వధేరా)గాంధీ పేరు లేకపోతె ప్రియాంకా గారి పిల్లకాయ పేరో పెట్టాలని శానా కుతూహలంగా వున్నాము’’.
సోనియా దానికి ఇలా సమాధానమిచ్చారు, “చాల సంతోషం, నీకూ,
ఆంద్ర ప్రదేశ్ లో కాంగ్రెస్ లీడర్లకీ మా
కుటుంబం అంటే విశ్వాశము చాలా ఎక్కువ. యితర రాష్ట్ర కాంగ్రెసోళ్ళే కాదు, ఏ జంతువు
కూడా విశ్వాశము లో మీకు సాటి రాదు, ప్రొసీడ్ !”
కిరణ్ కుమార్ రెడ్డి నోరు విప్పి ఏదో చెప్పేలోగా, పక్కనే
కూర్చుని యిదంతా వింటోన్న బొత్స సత్తిబాబు
ఇలా అన్నాడు, “కిరణ్ కుమార్ రెడ్డీ, నువ్వేం బాధ పడకు, నే చూసుకుంటా, ఈ రూఫ్ టాప్
సంగటి ఎంతో తేల్చేస్తా...టాప్ లేపెస్తా’
బొత్స సత్తి బాబు రాష్ట్రం లో అన్ని రూఫ్ టాప్ లూ సర్వే చేసి
ఫైనల్ గా యిలా రిపోర్ట్ పంపిచేడు కిరణ్ కి.
బొత్స సత్తి బాబు కిరణ్ కి ఇచ్చిన రిపోర్ట్ : మనము గుజరాత్ ని చూసి ఏమీ భాద పడనవసరం లేదు, మన రాష్ట్రం
లో కూడా కావలసినన్ని రూఫ్ టాప్ లు వున్నాయ్. గుజరాత్లో ఒక రూఫ్ టాప్ కి వెయ్య
రూపాయలు వస్తే మన పధకం ఒక రూఫ్ టాప్ కి దానికి పది రెట్లు, అంటే పది వేల రూపాయలు సంపాదించే
అయిడియా నా దగ్గరుంది. వెధవ విద్యుత్ వుత్పత్తి కి రూఫ్ టాప్ లు వృధా చేసే బదులు,
ఆ రూఫ్ టాప్ లను ‘రూఫ్ టాప్ బార్’ ల్లాగా పెట్టేస్తే మన ప్రభుత్వానికి డబ్బే డబ్బు. అటు అపార్ట్ మెంట్ లో నివసించే ప్రజలకి
ఎక్కడికో వెళ్లి తాగాల్సిన బాధ వుండదు. యిలా అపార్ట్ మెంట్ లోనించి బయటకు వచ్చి
అలా అదే అపార్ట్ మెంట్ రూఫ్ టాప్ కి వెళ్లి తాగేయొచ్చు. తాగే వాడి కొంప(అపార్ట్
మెంట్) అదే రూఫ్ టాప్ క్రిందే వుంటుంది కాబట్టి తెల్లారే వరకూ తాగుతూ అక్కడే పడి
వుంటాడు. దాని వల్ల మన లిక్కర్ సేల్స్ కూడా పెరుగుతాయి. దీనికి ‘రాహుల్ రూఫ్ టాప్
బార్ పధకం’ అని పేరు పెడదాము. ఈ పధకం వల్ల మరికొన్ని వుపయోగాలు :
·
1) ప్రజలు ఇప్పటికన్నా
ఎక్కువగా తాగి, ఆరోగ్యాలు పాడుచేసుకుంటారు, దానివల్ల డాక్టర్లు, నర్సులకు వుద్యోగావకాశాలు
ఎక్కువ అవుతాయి.( ఆ డాక్టర్లు, నర్సుల
నియామకాల్లో మళ్లీ మనం కొన్ని కోట్లు నోక్కేయ్యోచ్చు)
· 2)
ప్రజలు ఇప్పటికన్నా యింకా ఎక్కువగా
తాగితే హత్యలు, రేపులూ, మానభంగాలూ, దొంగతనాలూ అవుతాయి కాబట్టి పోలీసు వుద్యోగ అవకాశాలు బాగా పెరుగు తాయి.
· 3)
మందు డిమాండ్ పెరుగుతుంది
కాబట్టి మరిన్ని డిస్టిలరీలకు లైసెన్సులు ఇవ్వొచ్చు ( మళ్లీ ఆ లైసెన్సు ల జారీలో
కొన్ని కోట్లు పార్టీ ఫండ్ గా పిండ వచ్చు)
ఈ అయిడియా నేను ఇచ్చినందుకు నా బందువులకు తూర్పు ఆంధ్రా లో
అన్ని రూఫ్ టాప్ బార్ల లైసెన్స్ లు ఇవ్వాలి. రాయలసీమ లైసెన్స్ లు అన్నీ నువ్
తీసేస్కో. మిగిలిన జిల్లాల్లో లైసెన్స్ లు
అన్నీ మిగిలిన అసమ్మతి వాదులకు ఇచ్చేద్దాం. పిచ్చి నరేంద్ర మోడి మన రూఫ్ టాప్
పోలసీ చూసి విస్తు పోతాడు, నరేంద్ర మోడి మనతో ఎప్పటికీ పోటీ పడలేడు. ఎందుకంటే
గుజరాత్ లో మద్య పాన నిషేధం వుంది కాబట్టి, వాళ్ళ రూఫ్ టాప్ ల్లో బోడి విద్యుత్
వుత్పత్తి తప్పితే మనలా ‘రూఫ్ టాప్ బార్’ లు ఎప్పటికీ పెట్టలేరు.
చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా...మన బ్రతుకంత బ్రాంది
యేర తెలుగోడా
పెగ్గెత్తి జై కొట్టు తెలుగోడా... మన బ్రతుకంత బినామీల
వెలుగేరా
వీధి వీధి కి బ్రాంది షాపులున్నయ్ రా...అవి
అన్ని మన రాష్ట్ర ప్రగతే రా
ఆంద్ర ప్రదేశ్ అంటే అది తప్పేరా ..మనది
మధ్యాంధ్ర ప్రదేశ్ అనీ పొంగిపోవాలి రా
బ్రాంది షాపులన్ని వేలమేసి అమ్మిన ఘనులున్న ఘనత
మనదేరా
గాంధీ సూత్రాలన్నీ నేల రాసిన ఘనత, నేటి గాంధీల
ఘనతేరా
చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా...మన బ్రతుకంత బ్రాంది
యేర తెలుగోడా
చివరికి మన బ్రతుకు అంతే.బాగా చెప్పారు.
రిప్లయితొలగించండి